వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలి
ABN , First Publish Date - 2021-07-30T03:28:24+05:30 IST
విత్తనం మొదలు పంట చేతికొచ్చే వరకు నూతన పద్ధతులు అవలంబించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు శివనారాయణ కోరారు.
జేడీఏ శివనారాయణ
వాకాడు, జూలై 29 : విత్తనం మొదలు పంట చేతికొచ్చే వరకు నూతన పద్ధతులు అవలంబించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు శివనారాయణ కోరారు. వాకాడు రైతు భరోసా కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. జీలుగ, పిల్లిపెసర విత్తనాలను రైతులకు అందజేశారు. మండల ఏవో విజయభారతి, బీఏఏ లక్ష్మయ్య, రైతులు పాల్గొన్నారు.