రాములోరికి అప్పన్న ముత్యాల కానుక

ABN , First Publish Date - 2020-04-03T11:34:03+05:30 IST

శ్రీరామనవమి సందర్భంగా విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలోని సీతారాములకు వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం తరపున పట్టువస్త్రాలు, ముత్యా

రాములోరికి అప్పన్న ముత్యాల కానుక

సింహాచలం, ఏప్రిల్‌ 2: శ్రీరామనవమి సందర్భంగా విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలోని సీతారాములకు వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి మారెళ్ల వెంకటేశ్వరరావు, ఆలయ స్థానాచార్యులు డాక్టర్‌ టి.పి.రాజగోపాల్‌, ఉపప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, ఏఈవో పులి రామారావు, వేదపండితులు సుబ్రహ్మణ్యశర్మ వాటిని తీసుకువెళ్లి అక్కడి నిర్వాహకులకు అందజేశారు.


అప్పన్నకు ముత్యాల తలంబ్రాలు

సింహగిరిపై ఈనెల 4న ఏకాంత సేవగా జరగనున్న సింహాచల వరాహలక్ష్మీనృసింహస్వామి వార్షిక తిరుకల్యాణోత్సవానికి నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు దంపతులు గురువారం ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు దేవస్థానం ఈఓ వెంకటేశ్వరరావుకు అందజేశారు. 

Updated Date - 2020-04-03T11:34:03+05:30 IST