మెదడు ఫోటోతో ఇంగ్లండ్ను ట్రోల్ చేసిన సెహ్వాగ్
ABN , First Publish Date - 2021-03-07T19:27:02+05:30 IST
టీమిండియా మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంగ్లండ్ను ట్రోల్ చేస్తూ తన ఇన్స్టాగ్రాంలో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన వారంతా సెహ్వాగ్ క్రియేటివీటికి ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో వీరూ..
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంగ్లండ్ను ట్రోల్ చేస్తూ తన ఇన్స్టాగ్రాంలో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన వారంతా సెహ్వాగ్ క్రియేటివీటికి ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో వీరూ చాలా యాక్టివ్గా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. టీమిండియాపై ఎవరైనా విమర్శలు చేస్తే సెహ్వాగ్కు కోపం వచ్చేస్తుంది. అదను చూసి వాళ్లను దెబ్బ కొడతారు. తాజాగా ఇంగ్లండ్ అలాంటి చిక్కుల్లోనే చిక్కుకుంది. టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ ఘోరంగా ఓడిపోయింది. ఈ సిరీస్ ముందు నుంచి ప్రతి మ్యాచ్ అయిపోగానే ఇంగ్లండ్ మాజీలు టీమిండియాను, ఇక్కడి పిచ్లను విపరీతంగా విమర్శించారు. వాటన్నింటికీ ఇప్పుడు సెహ్వాగ్ ఒక్క పోస్టుతో అదిరిపోయే సమాధానం చెప్పారు.
సెహ్వాగ్ శనివారం తన ఇన్స్టాగ్రాంలో ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఓ మెదడు ఫోటోను షేర్ చేశారు. దాని పక్కనే ఇంగ్లండ్ జట్టు దీనిని(మెదడును) అహ్మదాబాద్లో మాత్రమే పొగొట్టుకోలేదు. మొత్తానికి కోల్పోయారు’ అని అందులో రాసుకొచ్చారు. అలాగే టీమిండియా 3-1 సిరీస్ విజయాన్ని ప్రశంసించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.