చంద్రగిరిలో 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2021-06-18T06:29:19+05:30 IST

చంద్రగిరిలో 1,100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, నలుగురు యువకులను అరెస్టు చేశారు.

చంద్రగిరిలో 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం
నిందితుల వివరాలు తెలియజేస్తున్న పోలీసులు

నలుగురు యువకుల అరెస్టు


చంద్రగిరి, జూన్‌ 17: చంద్రగిరిలో 1,100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, నలుగురు యువకులను అరెస్టు చేశారు. చంద్రగిరి సీఐ రామచంద్రారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. బుధవారం సాయంత్రం చంద్రగిరి కొత్తపేట సమీపంలోని బ్రహ్మంగారిగుడి వద్ద నలుగురు యువకులు గంజాయిని విక్రయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. సీఐతోపాటు ఎస్‌ఐ రామకృష్ణ, ఏఎస్‌ఐ సుధాకర్‌, కానిస్టేబుళ్లు రవి, ధనంజయనాయుడు, అవతారం, గోపిలు రెవెన్యూ సిబ్బందితో కలిసి దాడి చేశారు. అక్కడున్న యువకులు పోలీసులను చూసి పరారవడానికి ప్రయత్నించగా, వెంబడించి పట్టుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి 1,100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్నవారిని విచారించగా.. చంద్రగిరికి చెందిన రాజేష్‌, అలీబాషా, శ్రీను, పిచ్చినాయుడుపల్లెకు చెందిన అజయ్‌కుమార్‌లుగా గుర్తించారు. వీరు పూతలపట్టు మండలంలోని బండపల్లెకు చెందిన గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయిని కొనుగోలు చేసినట్లు తేలింది. నిందితులను కోర్టు ఆదేశాలతో గురువారం రిమాండ్‌కు పంపారు. 

Updated Date - 2021-06-18T06:29:19+05:30 IST