భారీగా నిషేధిత పత్తి విత్తనాలు స్వాధీనం
ABN , First Publish Date - 2021-06-17T04:32:30+05:30 IST
మండలంలో బుధవారం కౌటాల సీఐ బుద్ధే స్వామి, ఎస్సై సాగర్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో దాడులు నిర్వహించగా 2.30క్విం టాళ్ల గ్లైసిల్ పత్తివిత్తనాలు లభ్యమైనట్లు పేర్కొన్నారు.
బెజ్జూరు, జూన్ 16: మండలంలో బుధవారం కౌటాల సీఐ బుద్ధే స్వామి, ఎస్సై సాగర్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో దాడులు నిర్వహించగా 2.30క్విం టాళ్ల గ్లైసిల్ పత్తివిత్తనాలు లభ్యమైనట్లు పేర్కొన్నారు. బెజ్జూరు మండలంలోని తలాయి గ్రామానికి చెందిన లంగారి భూపతి ఇంట్లో 90కిలోలు, మర్తిడికి చెందిన సయ్యద్షాహీద్అలీ ఇంట్లో 90కిలోలు, చింతలమానే పల్లి మండలం కర్జేల్లికి చెందిన చౌదరిశేఖర్ వద్ద 50కిలోలు లభ్యమైనట్లు పేర్కొన్నారు. నకిలీ గ్లైసిల్ పత్తి విత్తనాలను స్వాధీన పర్చుకుని ముగ్గురిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
కాగజ్నగర్ మండలంలో రెండు క్వింటాళ్లు..
కాగజ్నగర్ రూరల్: కాగజ్నగర్ మండలం ఈసుగాం శివమల్లన్న ఆలయ సమీపంలో తనిఖీల్లో భాగంగా రెండు క్వింటాళ్ల నిషేధిత గ్లైసిల్ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్సై సందీప్కు మార్ తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. సిబ్బందితో కలిసి ఈసుగాం ఆలయ సమీపంలో వాహనాల తనిఖీ చేపడుతుండగా కాగజ్నగర్ పట్టణంలోని భవానీ సీడ్స్ దుకాణం యజమానికి ముద్దుకూరి రాంబాబు విక్రయానికి తరలిస్తున్న రెండు క్వింటాళ్ల పత్తి విత్తనాలు స్వాధీనపర్చుకున్నట్లు తెలిపారు. ఈమేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసునమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.