భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
ABN , First Publish Date - 2021-03-27T22:48:10+05:30 IST
భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను జిల్లా పోలీసులు స్వాధీనం
కర్నూలు: భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలను తరలిస్తున్నారనే విశ్వసనీయమైన సమాచారం పోలీసులకు అందింది. దీంతో కల్లూరు మండలంలోని ఉలిందకొండ గ్రామంలో వాహనాల తనిఖీలను పోలీసులు చేపట్టారు. ఆటోలో తరలిస్తున్న 782 జిలిటెన్ స్టిక్స్, 800 డిటోనేటర్లను ఈ తనిఖీల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో సంబంధమున్న రామానాయుడు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆటోను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.