120 కిలోల గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2020-09-16T00:38:56+05:30 IST
కంచరపాలెం పీఎస్ పరిధిలో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 120 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు...
విశాఖ: కంచరపాలెం పీఎస్ పరిధిలో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 120 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 2.5 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా 13 వేల రూపాయలతో పాటు సెల్ఫోన్లను సీజ్ చేసిన పోలీసులు ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
భద్రాద్రిలో రూ. 34 లక్షల గంజాయి స్వాధీనం..
భద్రాద్రి: భద్రాచలం ఫారెస్టు చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీసీఎంలో తరలిస్తున్న సుమారు రూ. 34 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు.