150 కేజీల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2022-01-28T05:11:25+05:30 IST

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని గురువారం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారయ్యారు.

150 కేజీల గంజాయి పట్టివేత
పోలీసులు పట్టుకున్న గంజాయి, వాహనాలు

ఇద్దరి అరెస్టు.. మరో ఇద్దరు పరారీ 


గాజువాక, జనవరి 27: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని గురువారం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారయ్యారు. సీఐ మన్మథరావు తెలిపిన వివరాల మేరకు హుకుంపేటకు చెందిన వి.రాజు, పెదబయలుకు చెందిన నాని, మరో ఇద్దరితో కలిసి ఆటోలో గంజాయి తరలిస్తున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అగనంపూడి వద్ద ఆటోను ఆపి, అందులోని 150 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఆటో వెనుక ద్విచక్రవాహనాలపై అనుసరిస్తున్న నిందితులు బైక్‌లు వదిలి పారిపోతుండగా వెంబడించారు. వారిలో ఒకరు పోలీసులకు చిక్కగా అతడితో పాటు ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారయ్యారు. ఆటోతో పాటు మూడు బైక్‌లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-01-28T05:11:25+05:30 IST