20 క్వింటాళ్ల రేషన్బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2021-04-13T05:30:00+05:30 IST
మండల కేంద్రంలోని స్దానిక పోలీస్స్టేషన్ వద్ద మంగళవారం వాహనాల తనిఖీలో అక్ర మంగా అనుమతులు లేకుండా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న బొలేరో టీఎస్ 15 యూబీ 2515 వాహనాన్ని పట్టుకున్నట్లు ఎస్సై వెంకటరమణ తెలిపారు.
నర్సాపూర్(జి), ఏప్రిల్ 13 : మండల కేంద్రంలోని స్దానిక పోలీస్స్టేషన్ వద్ద మంగళవారం వాహనాల తనిఖీలో అక్ర మంగా అనుమతులు లేకుండా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న బొలేరో టీఎస్ 15 యూబీ 2515 వాహనాన్ని పట్టుకున్నట్లు ఎస్సై వెంకటరమణ తెలిపారు. ఖాళీ డబ్బాల మాటున ఇరవై క్వింటాళ్ల రేషన్బియ్యం నిర్మల్ నుండి మహారాష్ట్ర తరలిస్తున్నారని తెలిపారు. మాస్కులు లేకుండా బయట తిరుగున్న పద్దెనిమిది మందిపై కేసులనమోదు చేశామన్నారు.