25 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2021-04-19T06:06:10+05:30 IST
పట్టణంలోని అంబేడ్కర్ కాలనీలోని ఓ ఇంట్లో నిల్వ చేసిన 25క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు ఆది వారం స్వాధీనం చేసుకున్నారు.
కోదాడటౌన్, ఏప్రిల్ 18: పట్టణంలోని అంబేడ్కర్ కాలనీలోని ఓ ఇంట్లో నిల్వ చేసిన 25క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు ఆది వారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కాలనీలోని ఒర్సు గురుస్వామి ఇంట్లో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. ఏపీలోని జగ్గయ్యపేటకు చెందిన మక్కళ్ళ రాంబాబు, చిప్పగిరి వెంకటేశ్వర్లు కోదాడ పరిసర ప్రాంతాల్లో పీడీఎస్ బియ్యాన్ని త క్కువ రేటు సేకరించి, వాహనంలో నందిగామ తరిలిచేందుకు సిద్ధం చే స్తుండగా పట్టుకున్నారు. వాహనం, బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.