సూర్యాపేట జిల్లాలో గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2021-10-11T23:44:41+05:30 IST
జిల్లాలోని మద్దిరాల మండలంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల...
సూర్యాపేట: జిల్లాలోని మద్దిరాల మండలంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల గంజాయిని ఎర్రపహాడ్ క్రాస్ రోడ్ వద్ద మద్దిరాల పోలీసులు పట్టుకున్నారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన బబ్లు, నిషులాళ్లు అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితుపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.