గంజాయి మొక్కల స్వాధీనం
ABN , First Publish Date - 2021-10-23T04:41:36+05:30 IST
గంజాయి మొక్కల స్వాధీనం
బంట్వారం: కౌలుకు తీసుకున్న పొలంలో పెంచిన గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన బంట్వారం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పసుపుల చెన్నప్ప అదే గ్రామానికి చెందిన పడుగుల శంకరప్ప పొలాన్ని కొన్నేళ్లుగా కౌలుకు తీసుకున్నాడు. అందులో పసుపు పంట సాగుతో పాటు గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. విషయం తెలుసుకున్న మర్పల్లి ఎక్సైజ్ సీఐ శ్రీలత, పోలీసులు పొలాన్ని పరిశీలించారు. 31గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటి బరువు సుమారు రెండు కిలోల వరకు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. రైతు చెన్నప్పను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీలత తెలిపారు.