కబేళాకు తరలిస్తున్న పశువుల పట్టివేత

ABN , First Publish Date - 2020-09-19T09:47:57+05:30 IST

పశువులను కబేళాకు తరలిస్తున్న నాలుగు వాహనా లను విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) కార్యకర్తలు శుక్రవారం అడ్డుకుని పోలీసు లకు

కబేళాకు తరలిస్తున్న పశువుల పట్టివేత

బీబీనగర్‌, సెప్టెంబరు 18:   పశువులను కబేళాకు తరలిస్తున్న నాలుగు వాహనా లను విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) కార్యకర్తలు శుక్రవారం అడ్డుకుని పోలీసు లకు అప్పగించారు. జనగాంలోని నవాబుపేట సంత నుంచి రెండు డీసీఎంలు, రెండు బొలేరో వాహనాల్లో 43 పశువులను అక్రమంగా హైదరాబాద్‌కుతరలిస్తుండగా ఆలేరు, వంగపల్లి, భువనగిరి నుంచి వాహనాలను వీహెచ్‌పీ కార్యకర్తలు  అనుసరిస్తూ గూడూరు టోల్‌ ప్లాజా వద్ద వీహెచ్‌పీ ఉమ్మడి జిల్లాల కార్యదర్శి తోట భానుప్రసాద్‌ ఆధ్వర్యంలో అడ్డుకుని బీబీనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు.  వీటిలో ఐదు పశువులు మృతి చెందగా, మిగిలిన వాటిని రాజాపేట మండలం చల్లూరులోని గోశాలకు తరలించారు.  పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న రహీంపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాఘవేందర్‌ తెలిపారు.

Updated Date - 2020-09-19T09:47:57+05:30 IST