చౌకబియ్యం పట్టివేత - ఆటోలు సీజ్
ABN , First Publish Date - 2021-06-14T05:08:45+05:30 IST
కమలాపురం-ఖాజీపేటకు వెళ్లే మార్గం లో పెన్నానది వంతెన వద్ద అక్రమంగా తరలిస్తున్న చౌక బియ్యా న్ని పట్టుకున్నట్లు తహసీల్దారు విజయ్కుమార్ తెలిపారు.
కమలాపురం(రూరల్), జూన్ 13: కమలాపురం-ఖాజీపేటకు వెళ్లే మార్గం లో పెన్నానది వంతెన వద్ద అక్రమంగా తరలిస్తున్న చౌక బియ్యా న్ని పట్టుకున్నట్లు తహసీల్దారు విజయ్కుమార్ తెలిపారు. ఆదివారం ఆటోలో బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో వీఆర్వోలను అప్రమత్తం చేసి నిఘా పెట్టా మన్నా రు. కమలాపురం నుంచి ఖాజీపేట వైపునకు మూడు ఆటోల్లో తరలిస్తున్న 1825 కేజీల బియ్యాన్ని, ముగ్గురి నిందితులను పట్టుకుని పోలీసుస్టేషన్లో అప్పగించామన్నారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తులసీనాగప్రసాద్ తెలిపారు.