మహారాష్ట్రలో రూ. 1000 కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత

ABN , First Publish Date - 2020-08-10T21:13:52+05:30 IST

మహారాష్ట్రలో రూ. 1000 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి.

మహారాష్ట్రలో రూ. 1000 కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత

ముంబై: మహారాష్ట్రలో రూ. 1000 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. నేవీ ముంబై కేంద్రంగా సాగుతున్న ఆఫ్ఘనిస్తాన్ హెరాయిన్ డ్రగ్స్ ముఠా గుట్టును కస్టమ్స్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు రట్టుచేశారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ దేశం మీదుగా నవశివ పోర్టుకు 191 కిలోల హెరాయిన్‌ను తరలించగా అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ. వెయ్యి కోట్లు ఉంటుందని తెలిపారు. హెరాయిన్‌ను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. ప్లాస్టిక్ పైపుల్లో హెరాయిన్‌ను ఉంచి.. ఎదురు కట్టెల్లాలాగా రవాణా చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు.

Updated Date - 2020-08-10T21:13:52+05:30 IST