ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2021-12-01T04:57:22+05:30 IST

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో

ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన గోల్డ్‌

శంషాబాద్‌రూరల్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో సారి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఇంటలిజెంట్‌ అధికారుల సమాచారం మేరకు గౌహతి నుంచి ఇండిగో విమానంలో మంగళవారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు చేరుకున్న ప్రయాణి కుడిని కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేయగా అతడి వద్ద 472.8 గ్రాముల బంగారం పట్టుబడింది. ఫెస్ట్‌ రూపంలోకి మార్చి తీసుకొస్తున్నట్లు గుర్తిం చారు. ఈ బంగారం విలువ రూ.23.33లక్షలు ఉంటుందని అధికారులు వెల్ల డించారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలి పారు. పట్టుబడిన బంగారాన్ని సీజ్‌ చేశామని చెప్పారు.  వరుసగా వారం రోజులుగా విమానాశ్రయంలో బంగారం పట్టుబడుతుండటం గమనార్హం.




Updated Date - 2021-12-01T04:57:22+05:30 IST