అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2020-09-12T01:41:23+05:30 IST

జిల్లాలోని జీలుగుమిల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు..

అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం

పశ్చిమ గోదావరి: జిల్లాలోని జీలుగుమిల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ  నుంచి అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు 33,000/- ఉంటుంది. తనిఖీల్లో 24 మద్యం బాటిల్స్, మోటార్ సైకిల్, వ్యాన్ ను స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-09-12T01:41:23+05:30 IST