వేర్వేరు ప్రాంతాల్లో గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2021-10-31T02:16:48+05:30 IST
రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలలో రవాణా అవుతున్న గంజాయిని
హైదరాబాద్: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలలో రవాణా అవుతున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.మంచిర్యాల, వనపర్తి జిల్లాలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మండలంలో వివిధ ప్రాంతాలకు గంజాయి సప్లై చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు. వారి వద్ద నుంచి 900 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ రాష్ట్రంలోని అరకు లోయ నుంచి రైలు మార్గంలో మంచిర్యాల జిల్లాకు గంజాయి రవాణా జరుగుతోందని పోలీసులు తెలిపారు.
అలాగే వనపర్తి జిల్లాలో 160 గ్రాముల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీనితో సంబంధమున్న ముగ్గురు యువకులను అరెస్ట్ చేసారు.