రేషన్ బియ్యం స్వాధీనం
ABN , First Publish Date - 2020-08-12T11:09:29+05:30 IST
లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పిఠాపురం, ఆగస్టు 11: లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి కాకినాడ రూరల్ మండలం చొల్లంగి లారీలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పట్టణ శివారు వై.జంక్షన్ వద్ద పిఠాపురం సీఐ పి.రామచంద్రరావు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. లారీతో పాటు 209 బియ్యం బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పౌర సరఫరాల శాఖాధికారులకు అప్పగిస్తామని పట్టణ ఎస్ఐ అబ్ధుల్నబీ తెలిపారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బియ్యాన్ని ఎంఎస్వో లక్ష్మీరమణి పరిశీలించారు.