ఎర్రచందనం దుంగల పట్టివేత

ABN , First Publish Date - 2021-07-22T16:04:59+05:30 IST

పీలేరు - తిరుపతి మార్గంలో ..

ఎర్రచందనం దుంగల పట్టివేత

భాకరాపేట: పీలేరు - తిరుపతి మార్గంలో భాకరాపేట అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్సు డీఎస్పీ మురళీధర్‌ తెలిపారు. భాకరాపేట ఘాట్‌ రోడ్డులో ఆర్‌ఎస్‌ఐలు విశ్వనాథం, లింగాధర్‌ టీమ్‌లు మంగళవారం రాత్రి ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లలో తనిఖీలు చేపట్టగా దొనకొండ గంగమ్మగుడి సమీపంలో కొంతమంది స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలు మోసుకుని వస్తుండగా టాస్క్‌ఫోర్సు సిబ్బంది చుట్టుముట్టారు. దీంతో దుండగులు దుంగలు పడవేసి చీకటిలో పారిపోయారన్నారు. ఆ ప్రాంతంలో గాలించగా 200కిలోల బరువు ఉన్న ఆరు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు సీఐ చంద్రశేఖర్‌ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో సీఐలు సుబ్రహ్మణ్యం, వెంకటరవి, డీఆర్వో నరసింహారావు, ఆర్‌ఎస్‌ఐ సురేష్‌ , టాస్క్‌ఫోర్సు పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-22T16:04:59+05:30 IST