రాష్ట్రస్థాయి సెపక్తక్రా పోటీలకు జిల్లా జట్లు ఎంపిక
ABN , First Publish Date - 2021-03-08T06:10:18+05:30 IST
రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పో టీలకు జిల్లా జట్లను ఖరారు చేశారు. జిల్లాకేంద్రంలోని డీఎస్ఏ మైదానంలో సెపక్తక్రా జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరిగాయి. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు.
సుభాష్నగర్, మార్చి 7: రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పో టీలకు జిల్లా జట్లను ఖరారు చేశారు. జిల్లాకేంద్రంలోని డీఎస్ఏ మైదానంలో సెపక్తక్రా జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరిగాయి. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జూనియర్ విభాగంలో 16, 17 తేదీల్లో ములుగు జిల్లా లో రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయి. ఈనెల 20, 21 తేదీల్లో సబ్ జూనియర్ విభాగంలో సిద్దిపేటలో రాష్ట్రస్థా యి పోటీలు జరగనున్నాయని తెలిపారు. ఈ సందర్భం గా సెపక్తక్రా కార్యదర్శి, నిర్వాహణ కార్యదర్శి గాదారి సంజీవ్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో ప్రతిభకనబ ర్చి జాతీయస్థాయిలో మంచిపేరు తీసుకురావాలన్నారు. కోచ్గా శ్యాం సుందర్రెడ్డి, దీపిక, నందిని వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం సతీష్రెడ్డి, సుభాష్రెడ్డి, శ్యాం నందిని, తదితరులు పాల్గొన్నారు. పోటీలకు ఎంపికైన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
బాలుర జూనియర్ విభాగం : అభినవ్రెడ్డి, ఉద య్కుమార్, ప్రణీత్గౌడ్, అనీష్రెడ్డి, రిత్విక్రెడ్డి, రా హుల్. బాలికల విభాగం: రిక్కిరెడ్డి, సాయిశ్రీ, లక్కీరె డ్డి, సాయిప్రణతి, సరయు, హరిణి. సబ్జూనియర్ బాలుర విభాగంలో : అనీష్, రాహుల్, వెంకటేష్, అ నూప్, భారత్తేజా. బాలికల విభాగంలో : సిరినితరె డ్డి, లక్కీరెడ్డి, సాయిప్రణతి, శ్రీవిద్య.
థైక్వాండో క్రీడాకారులకు బెల్టుల ప్రదానం
థైక్వాండోలో ప్రతిభకనబర్చిన క్రీడాకారులకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు, థైక్వాండో అసోసియేషన్ చైర్మన్ బ స్వా లక్ష్మీనర్సయ్య కలర్ బెల్టులను అందజేశారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని బస్వాగార్డెన్లో థైక్వాండో మాస్ట ర్ మనోజ్కుమార్ ఆధ్వర్యంలో బెల్టుప్రమోషన్ టెస్టులు నిర్వహించారు. ఇందులో 110 మంది హాజరయ్యారు. ప్రతిభ కనబర్చిన 80 మంది క్రీడాకారులకు లక్ష్మీనర్స య్య, డాక్టర్ స్రవంతి బెల్టులను ప్రదానం చేశారు.