సెల్ఫీ పిచ్చికి విద్యార్థి బలి
ABN , First Publish Date - 2022-01-28T17:20:14+05:30 IST
సెల్ఫీ పిచ్చికి మరో విద్యార్థి బలయ్యాడు. చామరాజనగర్ జిల్లా హనూరు తాలూకా పరిధి హొగనేకల్ జలపాతం చూసేందుకు వెళ్ళి విద్యార్థి సెల్ఫీ తీసుకునేవేళ కాలు జారి నదిలో పడి మృతిచెందారు. మైసూరుకు చెందిన ఉమాశంకర్ (19
- హాగనేకల్ ఫాల్స్ వద్ద కాలు జారి నదిలో పడిన వైనం
బెంగళూరు: సెల్ఫీ పిచ్చికి మరో విద్యార్థి బలయ్యాడు. చామరాజనగర్ జిల్లా హనూరు తాలూకా పరిధి హొగనేకల్ జలపాతం చూసేందుకు వెళ్ళి విద్యార్థి సెల్ఫీ తీసుకునేవేళ కాలు జారి నదిలో పడి మృతిచెందారు. మైసూరుకు చెందిన ఉమాశంకర్ (19) పారా మెడికల్ కోర్సు చేస్తున్నాడు. గురువారం మిత్రులతో కలిసి హొగనేకల్ జలపాతంకు వెళ్ళాడు. పైనుంచి నీరు కిందకు పడే చోటుకు వెళ్ళిన ఉమాశంకర్ సెల్ఫీ తీసుకునేందుకు వెళ్ళారు. ఒక్కసారిగా కాలుజారి నదిలో పడ్డాడు. తోటి మిత్రులు మలెమహదేశ్వర కొండ పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతదేహం కోసం గాలింపులు జరుపుతున్నారు. ప్రమాద విషయమై పోలీసులు తెలిపిన మేరకు మిత్రులంతా సరదాగా గడిపేందుకు వెళ్ళారని ఉమాశంకర్ చివరకు వెళ్ళి సెల్ఫీ తీసుకుంటుండగానే కాలు జారి పడ్డారన్నారు. మిత్రులను విచారిస్తున్నామని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామన్నారు.