కట్టుకున్నోడే కాలయముడు

ABN , First Publish Date - 2021-05-09T08:41:56+05:30 IST

జీవితాంతం తోడుంటానన్నాడు. ఏడు నెలలు కూడా కలిసి జీవించలేకపోయాడు. ఆలిపై పెంచుకున్న అనుమానం పెనుభూతమైంది. భార్యను చంపి, ఆమె శవం పక్కనే సెల్ఫీ తీసుకున్నాడు

కట్టుకున్నోడే కాలయముడు

  • భార్య శవంతో సెల్ఫీ 

కడప/బద్వేలు : జీవితాంతం తోడుంటానన్నాడు. ఏడు నెలలు కూడా కలిసి జీవించలేకపోయాడు. ఆలిపై పెంచుకున్న అనుమానం పెనుభూతమైంది. భార్యను చంపి, ఆమె శవం పక్కనే సెల్ఫీ తీసుకున్నాడు. పెను కలకలం రేపిన ఈ ఘటన శనివారం తెల్లవారుజామున కడపజిల్లా బద్వేలులో వెలుగు చూసిం ది. కడపజిల్లా జమ్మలమడుగుకు చెందిన మంజుల(23)కు కడప తిలక్‌నగర్‌కు చెందిన హరిబాబుతో గతేడాది నవంబరు 10న వివాహమైంది. కాలక్రమంలో వారి కాపురంలో అనుమానం బీజం మొలకెత్తింది. దీంతో గొడవలు మొదలయ్యాయి. వాటి పరిష్కారం కోసమంటూ 22 రోజుల కిందట భార్యభర్తలిద్దరూ బద్వేలు సుందరయ్య కాలనీలో బంధువుల ఇంటికి వచ్చారు. వారి ఇంటికి సమీపంలోనే అద్దె ఇంటిలోకి మకాం మార్చారు. అయితే శుక్రవారం అర్థరాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో శనివారం తెల్లవారుజామున భార్యను కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేసిన అతడు తానూ గాయపరచుకున్నాడు. అనంతరం భార్య శవంతో సెల్ఫీ తీసుకుని పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అప్పటికే మంజుల చనిపోయిందని, హరిబాబు బతికే ఉన్నట్లు గుర్తించారు.

Updated Date - 2021-05-09T08:41:56+05:30 IST