మొక్కజొన్న విత్తనాలు అమ్మితే జరిమానా

ABN , First Publish Date - 2020-05-21T08:55:50+05:30 IST

డీలర్లు మొక్కజొన్న విత్తనం విక్రయిస్తే జరిమానా విధిస్తామని, వానాకాలంలో రైతులు మొక్కజొన్న పంట సాగు చేస్తే రైతుబంధు మంజూరు కాదని మండల వ్యవసాయ

మొక్కజొన్న విత్తనాలు అమ్మితే జరిమానా

ధారూరు: డీలర్లు మొక్కజొన్న విత్తనం విక్రయిస్తే జరిమానా విధిస్తామని, వానాకాలంలో రైతులు మొక్కజొన్న పంట సాగు చేస్తే రైతుబంధు మంజూరు కాదని మండల వ్యవసాయ అధికారి జ్యోతి తెలిపారు. బుధవారం విత్తన డీలర్ల దుకాణాలను ఆమె తనిఖీ చేసిన అనంతరం సమావేశం ఏర్పాటు చేసి సూచనలు చేశారు. రైతులు ప్రభుత్వం సూచించిన పంటలనే సాగు చేసి అన్‌లైన్‌ చేసుకోవాలని ఆమె చెప్పారు. వరిలో సన్న రకాలనే సాగు చేయాలని వివరించారు. ఈ సమావేశంలో ఏఈఓ సంజూరాథోడ్‌, విత్తన డీలర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-21T08:55:50+05:30 IST