సెమీస్లో నిఖత్, నిహారిక
ABN , First Publish Date - 2021-10-26T08:10:22+05:30 IST
తీయ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలుగు బాక్సర్లు నిఖత్ జరీన్, గొనెళ్ల నిహారిక......
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలుగు బాక్సర్లు నిఖత్ జరీన్, గొనెళ్ల నిహారిక హవా కొనసాగుతోంది. ఈ ఇరువురు బాక్సర్లు తమ విభాగాల్లో సెమీస్కు దూసుకెళ్లి పతకాలు ఖాయం చేసుకున్నారు. సోమవారం జరిగిన 50-52 కిలోల విభాగం క్వార్టర్ఫైనల్లో నిఖత్ జరీన్ 5-0తో మంజు బసుమత్రి (అస్సోం)పై ఘన విజయం సాధించింది. ఇక, 63-66 కిలోల విభాగంలో నిహారిక 5-0తో బబిత బిస్త్ (ఉత్తరాఖండ్)పై నెగ్గి సెమీ్సలోకి ప్రవేశించింది. సెమీస్లో ఓడినా వీళ్లకు కాంస్య పతకాలు దక్కుతాయి. S