ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ప్రాణాలు కాపాడిన ట్రెయిన్ డ్రైవర్

ABN , First Publish Date - 2021-07-18T23:54:49+05:30 IST

ట్రెయిన్ డ్రైవర్ అప్రమత్తత ఓ వృద్ధుడి ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన ముంబైలోని కల్యాణ్‌లో జరిగింది.

ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ప్రాణాలు కాపాడిన ట్రెయిన్ డ్రైవర్

ముంబై: ట్రెయిన్ డ్రైవర్ అప్రమత్తత ఓ వృద్ధుడి ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన ముంబైలోని కల్యాణ్‌లో జరిగింది. క్షణాల్లో స్పందించి.. వృద్ధుడిని కాపాడిన డ్రైవర్‌పై ప్రశంసల వర్షం కురుపిస్తున్నారు. రైల్వేస్టేషన్‌లో పాదాచారుల వంతెన ఉన్నా.. చాలా మంది పట్టాలపై నడుచుకుంటూ అవతలి వైపునకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఆ కంగారులో ప్రాణాలపైకి తెచ్చుకుంటుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. 


రైల్వే స్టేషన్లలో పట్టాలు దాటి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వృద్ధుడు అదుపు తప్పి కిందపడిపోయాడు. అప్పటికే రైలు ముందుకు వస్తోంది. దీంతో అక్కడున్న వారంతా ఏం జరుగుతుందోనన్న ఆందోళనకు గురయ్యారు. ఇంతలో డ్రైవర్ స్పందించి వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. అయితే వృద్ధుడిపైకి ట్రెయిన్ వెళ్లి ఆగింది. అందరూ అటుగా పరిగెత్తారు. వృద్ధుడు ప్రాణాలతో ఉండటం చూసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మెల్లగా అతడిని ట్రెయిన్ కింద నుంచి బయటకు తీశారు. వృద్ధుడి ప్రాణాలు కాపాడిన రైల్వే సిబ్బందిని.. ముఖ్యంగా డ్రైవర్‌ను అందరూ అభినందిస్తున్నారు.  

Updated Date - 2021-07-18T23:54:49+05:30 IST