సీనియర్‌ జర్నలిస్టు మార్కండేయులు మృతి

ABN , First Publish Date - 2020-08-11T10:28:04+05:30 IST

సీనియర్‌ పాత్రికేయుడు, సంపాదకుడు జొన్నలగడ్డ మార్కండేయులు (70) సోమవారం కన్నుమూశారు.

సీనియర్‌ జర్నలిస్టు మార్కండేయులు మృతి

నెల్లూరు (సాంస్కృతిక ప్రతినిధి), ఆగస్టు 10 : సీనియర్‌ పాత్రికేయుడు, సంపాదకుడు జొన్నలగడ్డ మార్కండేయులు (70) సోమవారం కన్నుమూశారు. నెల్లూరులోని ఆయన నివాసంలో వేకువజామున నిద్రలోనే గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. మార్కండేయులు 1980లలో అంకితం సాహిత్య మాస పత్రికను నెల్లూరు నుంచి నడిపారు. వారి సొంత కోణార్క్‌ ప్రెస్‌లో ఎన్నో విరసం పుస్తకాలు అచ్చు వేశారు. వివిధ దిన పత్రికలతోపాటు లాయర్‌ వార పత్రికలోనూ చాలా కాలం పనిచేశారు. కావలి రమణయ్యతో కలిసి అక్షర వంటి బృహత్తర పుస్తకాలను వెలువరించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఏసీఎన్‌ లోకల్‌ టీవీలో తొలి రోజు ల్లో వార్తలు ప్రారంభించింది మార్కండేయులే. ఆయన మృతదేహాన్ని పలువురు  ప్రముఖులు, సంపాదకులు, జర్నలిస్టులు సందర్శించి నివాళులర్పించారు. సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. మార్కండేయులుకు ఒక్కడే కుమారుడు కోణార్క్‌. ఆయన కూడా పాత్రికేయ రంగంలోనే ఉన్నారు.

Updated Date - 2020-08-11T10:28:04+05:30 IST