శుక్రవారం ఎన్సీపీలో చేరనున్న ఖడ్సే

ABN , First Publish Date - 2020-10-21T19:57:03+05:30 IST

బీజేపీకి రాజీనామా చేసిన ఏకనాథ్ ఖడ్సే ఎన్సీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఎన్సీపీ నేత, మంత్రి జయంత్ పాటిల్ బుధవారం ప్రకటించారు.

శుక్రవారం ఎన్సీపీలో చేరనున్న ఖడ్సే

ముంబై : బీజేపీకి రాజీనామా చేసిన ఏకనాథ్ ఖడ్సే ఎన్సీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఎన్సీపీ నేత, మంత్రి జయంత్ పాటిల్ బుధవారం ప్రకటించారు. ‘‘చాలా ఏళ్ల పాటు ఖడ్సే బీజేపీలో ఉంటున్నారు. ఆయన బీజేపీకి రాజీనామా చేసినట్లు సమాచారం అందింది. అందుకే ఎన్సీపీలో చేర్చుకోవాలని నిశ్చయించుకున్నాం.శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు లాంఛనంగా ఖడ్సే ఎన్సీపీలో చేరనున్నారు.’’ అని జయంత్ పాటిల్ ప్రకటించారు.  అయితే నవరాత్రి ఉత్సవాల మొదటి రోజునే ఆయన ఎన్సీపీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందని ప్రచారం బాగా జరిగింది. కానీ... వివిధ కారణాల రీత్యా అది శుక్రవారానికి మారినట్లు సమాచారం.  

Updated Date - 2020-10-21T19:57:03+05:30 IST