అనారోగ్యంతో సీనియర్ ఫొటోగ్రాఫర్ మృతి
ABN , First Publish Date - 2021-06-21T04:41:33+05:30 IST
గత 50 ఏళ్లుగా వనపర్తిలో ఫొటోగ్రాఫర్గా సేవ లందించిన బెక్కరి ప్రకాశ్(68)అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు.
వనపర్తి రాజీవ్చౌరస్తా, జూన్ 20 : గత 50 ఏళ్లుగా వనపర్తిలో ఫొటోగ్రాఫర్గా సేవ లందించిన బెక్కరి ప్రకాశ్(68)అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. వనపర్తిలో తొలి ఫొటోస్టూడియో స్థాపించిన ఆర్టిస్ట్ నారాయణ కుమారుడు ప్రకాశ్ ఐదు దశాబ్దాలుగా ఫొటోగ్రఫి వృత్తిలో కొనసాగారు. అందరితో కలివిడిగా ఉండే ప్రకాశ్ ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో జిల్లా ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా సీని యర్ ఫొటోగ్రాఫర్ మృతి పట్ల వనపర్తి ఫొటో అండ్ వీడియో గ్రాఫర్ల సంఘం తీవ్ర సంతాపం తెలియజేశారు. స్టూడియోలన్నీ మూసివేశారు. రాజీవ్చౌక్లో ఆయన చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్బంగా ఫొటోగ్రఫి రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సీనియర్ ఫొటోగ్రాఫర్లు కలోరమ ప్రభాకర్, సుల్తాన్, రఫీ, భవాని రాము, జాని, ముంత శ్రీనివాసులు, నిర్మల, ఆర్కె బాబు శ్రీను, సంఘం అధ్యక్షుడు నవీన రమేష్, పలువురు పాల్గొన్నారు.