జీడీపీ గణాంకాలపై టెన్షన్.. మళ్లీ నష్టాల్లోకి దేశీయ మార్కెట్లు..

ABN , First Publish Date - 2020-11-27T21:41:20+05:30 IST

భారత మార్కెట్లు ఇవాళ మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించిన..

జీడీపీ గణాంకాలపై టెన్షన్.. మళ్లీ నష్టాల్లోకి దేశీయ మార్కెట్లు..

ముంబై: భారత మార్కెట్లు ఇవాళ మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించిన జీడీపీ గణాంకాలు వెల్లడికానున్న నేపథ్యంలో దేశీయ సూచీలు ఒడిదుడుకులకు గురైనట్టు ట్రేడింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 110.02 పాయింట్లు (0.25 శాతం) నష్టపోయి 44,149.72 వద్ద క్లోజ్ అయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 18 పాయింట్ల (0.14 శాతం) స్వల్ప నష్టంతో 12,969 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో బ్రిటానియా, ఏసియన్ పెయింట్స్, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, టైటాన్ కంపెనీ తదితర షేర్లు అత్యధిక లాభాలు నమోదు చేయగా... పవర్ గ్రిడ్ కార్ప్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ తదితర షేర్లు నీరసించాయి. 

Updated Date - 2020-11-27T21:41:20+05:30 IST