మరోసారి 36 వేల మార్కు దాటిన సెన్సెక్స్

ABN , First Publish Date - 2020-07-03T18:26:15+05:30 IST

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ వరుసగా మూడోరోజు లాభాల్లో కొనసాగుతున్నాయి...

మరోసారి 36 వేల మార్కు దాటిన సెన్సెక్స్

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ వరుసగా మూడోరోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్ల మేర ఎగబాకి మరోసారి కీలకమైన 36 వేల మార్కును దాటింది. ప్రస్తుతం బీఎస్‌ఈ సెన్సెక్స్ 197.52 పాయింట్లు (0.55 శాతం) బలపడి 36041.22 వద్ద కొనసాగుతోంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 66.35 పాయింట్లు (0.63 శాతం) లాభపడి 10618.05 వద్ద ట్రేడవుతోంది. జియోలో రూ. 1,894.50 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా టెక్ దిగ్గజం ఇంటెల్ ముందుకు రావడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1 శాతం మేర లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం సెషన్‌లో ఆటో, ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల జోరు కొనసాగగా.. ఫైనాన్షియల్స్ స్టాక్‌లు లాభాల స్వీకరణలో తచ్చాడుతున్నాయి.

Updated Date - 2020-07-03T18:26:15+05:30 IST