భారీగా పెరిగిన సెన్సెక్స్.. పదకొండేళ్లలో ఇదే గరిష్టం

ABN , First Publish Date - 2020-04-07T23:06:56+05:30 IST

ఒక్కరోజులో 8.97శాతం పెరిగిన సెన్సెక్స్ స్టాక్ మార్కెట్‌లో కొత్త ఉత్సాహం నింపింది. 2009 తర్వాత ఈ స్థాయిలో...

భారీగా పెరిగిన సెన్సెక్స్.. పదకొండేళ్లలో ఇదే గరిష్టం

న్యూఢిల్లీ: ఒక్కరోజులో 8.97శాతం పెరిగిన సెన్సెక్స్ స్టాక్ మార్కెట్‌లో కొత్త ఉత్సాహం నింపింది. 2009 తర్వాత ఈ స్థాయిలో సెన్సెక్స్ నమోదవడం ఇదే తొలిసారి. 30,067 వద్ద ముగిసిన సెన్సెక్స్, ప్రారంభంతో పోల్చితే 2,476 పాయింట్ల లాభాన్ని చేరుకుంది. ఇక నిఫ్టీ50 విషయానికి వస్తే 8,792 పాయింట్ల వద్ద 8.76శాతం లాభంతో ముగిసింది. ఇదిలా ఉంటే రెండు మార్కెట్ ఫ్లాట్‌ఫాంలలో ఇండస్‌ఇండ్ బ్యాంక్‌ టాప్‌లో నిలిచింది. తమ బ్యాంకుకు సంబంధించి అద్దె డిపాజిట్లు, అడ్వాన్సులు పెరిగినట్లు సంస్థ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు బ్యాంక్ షేర్లు 25శాతం మేర లాభాలను ఆర్జించాయి.

Updated Date - 2020-04-07T23:06:56+05:30 IST