బ్యాంకింగ్ షేర్ల దూకుడు.. దేశీయ మార్కెట్లకు భారీ లాభాలు..
ABN , First Publish Date - 2020-07-01T22:24:39+05:30 IST
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్ షేర్ల దూకుడుతో ...
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్ షేర్ల దూకుడుతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ ఇవాళ 500 పాయింట్ల లాభం నమోదు చేసింది. నిఫ్టీ సైతం 1.24 శాతం మేర ఎగబాకింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 499 పాయింట్లు (1.43 శాతం) లాభంతో 35,414 వద్ద క్లోజ్ అయ్యింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 128 పాయింట్లు (1.24 శాతం) లాభంతో 10,430 వద్ద ముగిసింది. యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫిన్సర్వ్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు తదితర స్టాక్లు 6.40 వరకు అత్యధిక లాభం నమోదు చేసిన వాటిలో ఉన్నాయి. ఇక ఎన్టీపీసీ, ఎల్అండ్టీ, నెస్లే ఇండియా, ఎంఅండ్ఎం, కొటాక్ బ్యాంకు, సన్ ఫార్మా కంపెనీలు 2.14 శాతం మేర అత్యధికంగా నష్టంపోయాయి.