వరుసగా నాలుగో రోజు దుమ్మురేపిన దేశీయ మార్కెట్లు

ABN , First Publish Date - 2020-07-06T22:32:41+05:30 IST

భారత స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్లో లాభాలు నమోదు చేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)..

వరుసగా నాలుగో రోజు దుమ్మురేపిన దేశీయ మార్కెట్లు

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్లో లాభాలు నమోదు చేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు జోరందుకోవడంతో సెన్సెక్స్ ఇవాళ 466 పాయింట్ల మేర ఎగబాకింది. నిఫ్టీ సైతం 1.47 మేర లాభం నమోదు చేసింది. భారత్‌, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తలు తగ్గుతుండడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఉత్సాహం చూపించినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 465.86 పాయింట్ల (1.29 శాతం) లాభంతో 36,487.28 వద్ద ముగిసింది. ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 156.30 పాయింట్లు (1.47 శాతం) లాభంతో 10,763.65 వద్ద క్లోజ్ అయ్యింది. మహీంద్రా అండ్ మహీంద్రా 7 శాతం లాభంతో టాప్‌లో ఉండగా.. బజాజ్ ఫైనాన్స్, ఆర్ఐఎల్, మారుతి, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టాటా స్టీల్ తదితర షేర్లు అత్యధిక లాభాలను నమోదు చేసిన వాటిలో ఉన్నాయి.

Updated Date - 2020-07-06T22:32:41+05:30 IST