హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూస్తాం:వెల్లంపల్లి

ABN , First Publish Date - 2020-09-21T21:24:18+05:30 IST

హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. దేవాలయాల్లో చాలా సంప్రదాయాలు ఉంటాయని, వాటిని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.

హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూస్తాం:వెల్లంపల్లి

విశాఖ: హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. దేవాలయాల్లో చాలా సంప్రదాయాలు ఉంటాయని, వాటిని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. దేవాలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని, అన్యాక్రాంతమైన దేవాలయాల భూముల్ని వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించారు. ఆలయాల భూముల పరిరక్షణకు జగన్‌ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. కృష్ణా పుష్కరాల సమయంలో అనేక ఆలయాల్ని కూల్చేశారని గుర్తుచేశారు. మతాలు, కులాలను సీఎంకు అంటగట్ట వద్దని హితవుపలికారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు హిందువుల పట్ల ప్రేమ లేదని వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు.

Updated Date - 2020-09-21T21:24:18+05:30 IST