SII ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మృతి
ABN , First Publish Date - 2021-12-08T22:53:45+05:30 IST
SII ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మృతి
న్యూఢిల్లీ: ఎస్ఐఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మృతి చెందారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ జాదవ్ పుణెలో 71 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అతను 1979 నుంచి ఎస్ఐఐలో ఉన్నారని, కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్ తయారీలో కీలకపాత్ర పోషించారు. బయోటెక్ ప్రపంచం కోలుకోలేని గొప్ప వ్యక్తిని కోల్పోయిందని బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్-షా ట్విట్టర్లో పేర్కొన్నారు.