బందరులో బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటు చేయండి

ABN , First Publish Date - 2020-07-01T09:44:37+05:30 IST

మచిలీపట్నంలో బల్క్‌డ్రగ్‌ పార్కును ఏర్పాటు చేయాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడకు ఎంపీ వల్లభనేని బాలశౌరి

బందరులో బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటు చేయండి

 కేంద్రమంత్రి సదానందగౌడకు ఎంపీ బాలశౌరి వినతి


ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం: మచిలీపట్నంలో బల్క్‌డ్రగ్‌ పార్కును ఏర్పాటు చేయాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడకు ఎంపీ వల్లభనేని బాలశౌరి మంగళవారం వినతిపత్రం అందజేశారు. పార్కును ఏర్పాటు చేస్తే అవసరమైన భూమి, ఇతర మౌలిక వసతులు,  రాయితీతో కూడిన విద్యుత్‌ అందించేందుకు సీఎం జగన్‌ సుముఖంగా ఉన్నారని ఎంపీ వివరించారు. తగు నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు. 

Updated Date - 2020-07-01T09:44:37+05:30 IST