మాస్క్ లేకుండా రోడ్డుపై తిరుగుతున్న ఏడుగురిపై కేసు

ABN , First Publish Date - 2020-04-10T15:04:51+05:30 IST

మాస్కులను ధరించకుండా వీధుల్లో తిరుగుతున్న ఏడుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన....

మాస్క్ లేకుండా రోడ్డుపై తిరుగుతున్న ఏడుగురిపై కేసు

పూణే (మహారాష్ట్ర): మాస్కులను ధరించకుండా వీధుల్లో తిరుగుతున్న ఏడుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన పూణే నగరంలో వెలుగుచూసింది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో మాస్కులను ధరించని వారిపై కేసులు పెట్టి అరెస్టు చేస్తామని పూణే మహానగర పాలక సంస్థ (పీఎంసీ) హెచ్చరించింది. ఇంటి నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆదేశించింది. ఖుండేలీ వాడీ ప్రాంతంలోని చికహళ్లీ ప్రాంతంలో ఏడుగురు వ్యక్తులు ముఖానికి ఎలాంటి మాస్క్ లు లేకుండా రోడ్లపై తిరుగుతుండగా పింప్రీ చించ్ వద్ పోలీసులు వారిపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-04-10T15:04:51+05:30 IST