సెమీస్‌లో ఏడుగురు భారత బాక్సర్లు

ABN , First Publish Date - 2021-04-21T08:50:45+05:30 IST

వరల్డ్‌ యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఏడుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్లోకి ప్రవేశించారు. బేబీ రోజిసనా చాను (51 కిలోలు), అరుంధతీ చౌదరి (69), సనమాచ చాను (75), అంకిత్‌

సెమీస్‌లో ఏడుగురు భారత బాక్సర్లు

వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌షి‌ప్


కీల్స్‌ (పోలెండ్‌): వరల్డ్‌ యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఏడుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్లోకి ప్రవేశించారు. బేబీ రోజిసనా చాను (51 కిలోలు), అరుంధతీ చౌదరి (69), సనమాచ చాను (75), అంకిత్‌ నర్వాల్‌ (64), విశాల్‌ గుప్తా (91), బిశ్వామిత్రా చోంగథమ్‌ (49), సచిన్‌ (56) మంగళవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో గెలుపొంది.. కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకొన్నారు. మహిళల 51 కిలోల క్వార్టర్స్‌లో బేబీ రోజిసన 5-0తో కుబికా (పోలెండ్‌)పై విజయం సాధించింది. ఇతర క్వార్టర్స్‌ బౌట్లలో అరుంధతి 5-0తో అన్నా సెజ్‌కో (ఉక్రెయిన్‌)పై గెలవగా.. రష్యా బాక్సర్‌ మార్గరెటా జువాపై సనమచా చాను నెగ్గింది. పురుషుల 49 కిలోల క్వార్టర్స్‌లో బిశ్వంత్‌మిత్రా 5-0తో ఒమర్‌ అమెటోవిచ్‌ (సెర్బియా)ను ఓడించాడు. 

Updated Date - 2021-04-21T08:50:45+05:30 IST