హైదరాబాద్‌‌లో ఏడుగురు ఇన్‌స్పెక్టర్ల బదిలీలు

ABN , First Publish Date - 2021-04-09T17:40:30+05:30 IST

హైదరాబాద్‌ సిటీ పోలీసు విభాగంలో ఇటీవల చోటు చేసుకుంటున్న

హైదరాబాద్‌‌లో ఏడుగురు ఇన్‌స్పెక్టర్ల బదిలీలు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ సిటీ పోలీసు విభాగంలో ఇటీవల చోటు చేసుకుంటున్న మార్పులతో పోలీసింగ్‌ మరింత బలోపేతమవుతోందనే భావం వ్యక్తమవుతోంది. తాజాగా ఏడుగురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేశారు. 


బేగంపేట అదనపు ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న గోడేషా నరేశ్‌కు చిలకలగూడ ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు అప్పగించారు. 

వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా దీర్ఘకాలంగా సేవలందించిన గట్టుమల్లు నారాయణగూడ పీఎస్‌ ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 

గోల్కొండ పీఎ్‌సకు కొన్ని రోజులుగా అటాచ్‌గా ఉన్న సరికొండ మట్టమ్‌ రాజును అదే పీఎస్‌ అదనపు ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు. 

ఎస్సార్‌ నగర్‌ పీఎ్‌సకు అటాచ్‌మెంట్‌లో ఉన్న పైడి వెంకట రామ ప్రసాదరావుకు అదే పీఎ్‌సలో అదనపు ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. 

బంజారాహిల్స్‌ ఎస్‌హెచ్‌ఓగా ఉన్న రోమినేని కళింగరావును సిటీ స్పెషల్‌ బ్రాంచ్‌కి బదిలీ చేశారు.

హబీబ్‌నగర్‌ ఎస్‌హెచ్‌ఓగా ఉన్న పూసపాటి శివచంద్ర ఇక బంజారాహిల్స్‌ ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు చేపడతారు.

వెస్ట్‌జోన్‌ డీసీపీ వీఆర్‌కు అటాచ్డ్‌గా ఉంటూ కొంతకాలంగా పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న మొగుళ్ల నరేందర్‌కు హబీబ్‌నగర్‌ బాధ్యతలు అప్పగించారు. 

తాజా బదిలీలతో నగరంలోని కీలక పోలీస్‌‌స్టేషన్లలో జరిగిన ప్రక్షాళనతో పాటు ఇతర జోన్లలోనూ కొన్ని పోలీస్‌‌స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓల బదిలీలు జరిగే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం బదిలీ అయిన పోలీస్‌‌స్టేషన్లలో అధికంగా వెస్ట్‌జోన్‌లోనే ఉన్నాయి. సెంట్రల్‌, నార్త్‌, ఈస్ట్‌, సౌత్‌జోన్లలోనూ త్వరలో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్న పోలీస్‌ ఉన్నతాధికారులు అక్కడ కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశముందని తెలుస్తోంది. 

Updated Date - 2021-04-09T17:40:30+05:30 IST