ఏడుగురు మృతి

ABN , First Publish Date - 2020-08-10T09:38:43+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ మరింత తీవ్రమైంది. ఆదివారం రికార్డు స్థాయిలో 1399 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది.

ఏడుగురు మృతి

ఏడుగురు మృతి


కర్నూలు(హాస్పిటల్‌), ఆగస్టు 9:  జిల్లాలో కరోనా వైరస్‌ మరింత తీవ్రమైంది. ఆదివారం రికార్డు స్థాయిలో 1399 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఈ నెల 5న అత్యధికంగా  1368 కేసులు నమోదయ్యాయి. తాజాగా అంతకు మించి కేసులు నమోదయ్యాయి. జిల్లాలో బాధితుల సంఖ్య 27,431కి చేరింది. ఇందులో 9,372 మంది చికిత్స పొందుతున్నారు. 17,814 మంది డిశ్చార్జి అయ్యారు. చికిత్స పొందుతూ మరో ఏడుగురు మృతి చెందారు. జిల్లాలో మృతుల సంఖ్య 245కు చేరింది. 


హోం ఐసొలేషన్‌లో మృతి

మహానంది  ఆగష్టు 9: మండల పరిధిలోని ఓ గ్రామంలో కొవిడ్‌ బారిన పడిన వృద్ధుడు(74) మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం ఆయనకు పాజిటివ్‌ వచ్చిందని, హోం ఐసొలేషన్‌లో ఉంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డాడని, నంద్యాలకు తరలించేందుకు 108 సమాచారం అందించామని వారు తెలిపారు. అంబులెన్సు వచ్చేలోగా మృతి చెందాడని తెలిపారు. 

Updated Date - 2020-08-10T09:38:43+05:30 IST