అగ్ర‌రాజ్యంలో మ‌ళ్లీ కాల్పులు.. ఏడుగురి మృతి!

ABN , First Publish Date - 2021-05-27T13:16:57+05:30 IST

అమెరికాలోని కాలిఫోర్నియాలో లైట్‌ రెయిల్‌ యార్డులో ఓ దుండగుడు కా ల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఏడుగురు మృతి చెం దారు. బుధవారం ఉదయం ఏడు గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. సాంటా క్లారా వ్యాలీ ట్రాన్స్‌పోర్టేషన్‌ ప్రాధికార సంస్థ నేతృత్వంలో నడిచే ఈ యార్డులో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు.

అగ్ర‌రాజ్యంలో మ‌ళ్లీ కాల్పులు.. ఏడుగురి మృతి!

కాల్పులు జరిపిన వ్యక్తి కూడా హతం

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో లైట్‌ రెయిల్‌ యార్డులో ఓ దుండగుడు కా ల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఏడుగురు మృతి చెం దారు. బుధవారం ఉదయం ఏడు గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. సాంటా క్లారా వ్యాలీ ట్రాన్స్‌పోర్టేషన్‌ ప్రాధికార సంస్థ నేతృత్వంలో నడిచే ఈ యార్డులో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దుండగుడిని హతమార్చారు. మృతుల్లో ట్రాన్స్‌పోర్టేషన్‌ సంస్థకు చెం దిన ఉద్యోగులు కూడా ఉన్నారని అధికారులు తెలిపా రు. సంస్థఉద్యోగుల సమావేశం జరుగుతుండగా దుం డగుడు కాల్పులు జరిపాడని ఓ ఉద్యోగి తల్లి చెప్పారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-05-27T13:16:57+05:30 IST