బీజేపీ అభ్యర్థుల ఏడో జాబితా విడుదల

ABN , First Publish Date - 2020-11-22T20:53:44+05:30 IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఏడవ జాబితా విడులైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ జాబితాను ఆదివారం విడుదల

బీజేపీ అభ్యర్థుల ఏడో జాబితా విడుదల

హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఏడవ జాబితా విడులైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ జాబితాను ఆదివారం విడుదల చేశారు. దీంతో 150 డివిజన్లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ నుంచి దాదాపుగా అభ్యర్థులు ఖరారైనట్టే. తాజాగా ఐదు డివిజన్లకు అభ్యర్థుల్ని ప్రకటించారు. ఈ డివిజన్లలో కాషాయ పార్టీ టికెట్ ఆశించి పలువురు నామినేషన్ వేశారు. కాగా ఈ కింది అభ్యర్థులను ఫైనల్ చేస్తూ మీడియాకు అధికారిక జాబితా విడుదల చేశారు.

  1. సీతాఫల్‌మండి- కె.దీప్తి
  2. బేగంబజార్‌- శంకర్‌యాదవ్
  3. గోషామహల్‌- లాల్‌సింగ్
  4. జాంబాగ్- రాకేష్‌ జైస్వాల్
  5. గన్‌ఫౌండ్రీ- సురేఖ ఓంప్రకాష్‌

Updated Date - 2020-11-22T20:53:44+05:30 IST