కాంగ్రెస్‌లో చేరిన పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు

ABN , First Publish Date - 2021-06-14T03:51:18+05:30 IST

మంచిర్యాల జిల్లా నస్పూర్‌ మున్సిపాలిటీకి చెందిన టీఆర్‌ఎస్‌ మైనార్టీ నాయకుడు ఖాలిద్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు వంద మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు టీఆర్‌ఎస్‌ నాయకులకు కండు వాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాంగ్రెస్‌లో చేరిన పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు
టీఆర్‌ఎస్‌ నాయకులను కండువా కప్పి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానిస్తున్న మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు

ఏసీసీ, జూన్‌ 13: మంచిర్యాల జిల్లా నస్పూర్‌ మున్సిపాలిటీకి చెందిన టీఆర్‌ఎస్‌ మైనార్టీ నాయకుడు ఖాలిద్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు వంద మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు టీఆర్‌ఎస్‌ నాయకులకు కండు వాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడుతూ ఖాలిద్‌, అతని అను చరులు కాంగ్రెస్‌లో చేరడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా విధానాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని, రాబోయే రోజుల్లో కేం ద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మహిళ అధ్యక్షురాలు పెంట రజిత నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-14T03:51:18+05:30 IST