మురుగు కాల్వలు, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2021-06-23T06:32:30+05:30 IST
తిమ్మాపురం గ్రామం వద్ద జాతీయ రహదారిపై మురుగు కాల్వలు, హైమాస్ట్ లైట్లు ఏర్పాటుచేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
అర్వపల్లి, జూన్ 22 : తిమ్మాపురం గ్రామం వద్ద జాతీయ రహదారిపై మురుగు కాల్వలు, హైమాస్ట్ లైట్లు ఏర్పాటుచేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సిరోంచ-రేణిగుంట జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డు వెంట కాల్వలు లేకపోవడంతో వర్షం వచ్చినప్పుడు ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హైవే అధికారులు, కాంట్రాక్టర్లకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించడంలేదని వారు వాపోయారు. పోలీసులు గ్రామస్థులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. సుమారు గంటపాటు ఆందోళన నిర్వహించారు. కార్యక్రమంలో నిమ్మల శ్రీకాంత్గౌడ్, బొడ్డు శంకర్, బొల్లం నిమ్మమ్మ, కోనేటి వెంకన్న, యల్లంల అవిలయ్య పాల్గొన్నారు.