‘దివీస్‌’ను సందర్శించిన ‌ఎస్‌ఈజడ్‌ కమిషనర్‌

ABN , First Publish Date - 2021-01-17T05:48:20+05:30 IST

దివీస్‌ కర్మాగారాన్ని స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఎస్‌ఈజడ్‌) కమిషనర్‌ ఎ.రామమోహన్‌రెడ్డి శనివారం సందర్శించారు.

‘దివీస్‌’ను సందర్శించిన ‌ఎస్‌ఈజడ్‌ కమిషనర్‌
దివీస్‌ అధికారులతో చర్చిస్తున్న కమిషనర్‌ రామమోహన్‌రెడ్డి

భీమునిపట్నం (రూరల్‌), జనవరి 16: దివీస్‌ కర్మాగారాన్ని స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఎస్‌ఈజడ్‌) కమిషనర్‌ ఎ.రామమోహన్‌రెడ్డి శనివారం సందర్శించారు.  ఈ సందర్భంగా వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం దివీస్‌ డైరెక్టర్‌ మధుసూధనరావు, జీఎం వైఎస్‌ కోటేశ్వరరావు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కర్మాగారంలో కొవిడ్‌ సమయంలో ఉత్పత్తి, ఇతర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే సిబ్బంది పనితీరుపై ఆయన ఆరా తీశారు.

Updated Date - 2021-01-17T05:48:20+05:30 IST