శభాష్‌ పోలీస్‌

ABN , First Publish Date - 2021-10-18T05:19:44+05:30 IST

పట్టణానికి చెందిన ఓ మహిళ భర్తతో కలిసి బైక్‌లో వివాహ వేడుకలకు వెళ్తూ మార్గమధ్యంలో గోల్డ్‌ డాలర్‌ను పొగొట్టుకుంది.

శభాష్‌ పోలీస్‌
బాధిత మహిళకు గోల్డ్‌ డాలర్‌ను అందిస్తున్న కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఎస్‌ఐ ద్వారక

ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 17 : పట్టణానికి చెందిన ఓ మహిళ భర్తతో కలిసి బైక్‌లో వివాహ వేడుకలకు వెళ్తూ మార్గమధ్యంలో  గోల్డ్‌ డాలర్‌ను పొగొట్టుకుంది. ఈ విషయం పోలీసులకు తెలుపగా వారు గంట వ్యవధిలోనే గుర్తించి బాధితురాలికి అందజేసి శభాష్‌ పోలీసు అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళితే..పట్టణానికి చెందిన గాయత్రీ అనే మహిళ తన భర్తతో కలిసి ఎర్రగుంట్ల రోడ్డు లో ఉన్న కళ్యాణమండపంకు వెళ్తూ, మార్గమధ్యంలో బంగారు డాలర్‌ను పొగొట్టుకుంది.  వెంటనే ఆమె స్థానిక రెండవ పట్టణ పోలీ్‌సస్టేషన్‌ ఆవరణలో ఉన్న కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు వచ్చి  ఫిర్యాదు చేసింది. దీంతో ఆ సెంటర్‌ సీఐ గంటా సుబ్బారావు బ్లూకోల్ట్‌ సిబ్బందిని అప్రమత్తం చేయగా బ్లూకోల్ట్‌ కానిస్టేబుల్‌ ఎన్‌.శ్రీనివాసులు, హోండార్డు సుబ్బరాయుడులు  ఎర్రగుంట్ల బైపా్‌సరోడ్డులో గోల్డ్‌ డాలర్‌ను గుర్తించి విషయాన్ని  అధికారులకు తెలిపారు. దీంతో గాయత్రీ దంపతులను కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి పిలిపించి, మహిళా ఎస్‌ఐ ద్వారక బ్లూకోల్ట్‌ సిబ్బంది సమక్షంలో అందజేశారు. దీంతో సీఐ సుబ్బారావు, సిబ్బందిని ఎస్‌పీ అన్భురాజన్‌ అభినందించారు. 

Updated Date - 2021-10-18T05:19:44+05:30 IST