మళ్లీ మా కూటమిదే అధికారం: షా

ABN , First Publish Date - 2021-03-08T07:46:54+05:30 IST

తమిళనాట మళ్లీ తమ కూటమే అధికారం చేపడుతుందని బీజేపీ అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం కన్నియాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌, సుశీంద్రంలలో ఆయన ప్రచారం నిర్వహించారు...

మళ్లీ మా కూటమిదే అధికారం: షా

చెన్నై, మార్చి 7(ఆంధ్రజ్యోతి): తమిళనాట మళ్లీ తమ కూటమే అధికారం చేపడుతుందని బీజేపీ అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం కన్నియాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌, సుశీంద్రంలలో ఆయన ప్రచారం నిర్వహించారు. కన్నియాకుమారి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి పొన్‌ రాధాకృష్ణన్‌కు మద్దతుగా ఇంటింటికి కరపత్రాల పంపిణీ ప్రచారాన్ని అమిత్‌షా ప్రారంభించారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఈ కరపత్రాలలో ముద్రించారు. నాగర్‌కోయిల్‌లోనూ అమిత్‌షా రోడ్‌షో నిర్వహించారు. 


Updated Date - 2021-03-08T07:46:54+05:30 IST