Shah Rukh Khans manager: పూజా దడ్లానీకి ముంబై పోలీసుల సమన్లు జారీ

ABN , First Publish Date - 2021-11-16T16:09:13+05:30 IST

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దడ్లానీకి ముంబై పోలీసులు రెండోసారి సమన్లు ​​జారీ చేశారు...

Shah Rukh Khans manager: పూజా దడ్లానీకి ముంబై పోలీసుల సమన్లు జారీ

ముంబై : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దడ్లానీకి ముంబై పోలీసులు రెండోసారి సమన్లు ​​జారీ చేశారు. షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్‌ డ్రగ్స్‌ కేసును నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ముంబై పోలీసులు షారుఖ్ మేనేజరు పూజాకు తాజాగా రెండోసారి సమన్లు జారీ చేశారు.ఈ డ్రగ్స్ కేసులో అక్రమ వసూళ్ల కోణంపై ముంబై పోలీసులు ఇప్పటికే 20మంది వాంగ్మూలాలను నమోదు చేశారు.తాను విచారణకు హాజరు కావడానికి పూజా దడ్లానీ మరికొంత సమయం అడిగిన దృష్ట్యా పోలీసులు మూడో సమన్ కూడా జారీ చేసే అవకాశం ఉంది.


డ్రగ్స్ కేసులో ముడుపుల చెల్లింపు ఆరోపణలపై శామ్ డిసౌజా సోమవారం ముంబై ప్రత్యేక పోలీసుల బృందం (సిట్) ముందు హాజరయ్యారు.ఆర్యన్ ఖాన్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసిన తర్వాత ఎన్సీబీ సాక్షి కె పి గోసావి డిసౌజాతో రూ. 25 కోట్ల పే ఆఫ్ డీల్ గురించి ఫోన్‌లో చర్చిస్తున్నట్లు తాను విన్నానని స్వతంత్ర సాక్షి ప్రభాకర్ సెయిల్ పేర్కొన్నాడు. ఈ కేసుకు సంబంధించి ఎన్‌సీబీ అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ముంబై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.క్రూయిజ్ డ్రగ్స్ కేసులో వసూళ్ల ఆరోపణలపై కూడా విచారణ జరుపుతున్న ఎన్సీబీ విజిలెన్స్ బృందం ఇప్పటికే డిసౌజా వాంగ్మూలాన్ని నమోదు చేసింది.


డిసౌజా బాంబే హైకోర్టులో దాఖలు చేసిన తన ముందస్తు బెయిల్ పిటిషన్‌లో ఆర్యన్ ఖాన్‌ను విడుదల చేయడానికి షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దడ్లానీ నుంచి గోసావి రూ. 50 లక్షలు తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ఈ కేసులో ఆర్యన్ ఖాన్‌ను అక్టోబర్ 3న ఎన్సీబీ అరెస్టు చేసిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చారని దరఖాస్తులో పేర్కొన్నారు.ఆర్యన్ ఖాన్‌ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని, అతను నిర్దోషి అని గోసావి తనతో చెప్పాడని డిసౌజా పేర్కొన్నారు.


Updated Date - 2021-11-16T16:09:13+05:30 IST