రెండున్నరేళ్లలో జగన్‌ సాధించింది అప్పు మాత్రమే: శైలజానాథ్

ABN , First Publish Date - 2022-01-05T21:25:28+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

రెండున్నరేళ్లలో జగన్‌ సాధించింది అప్పు మాత్రమే: శైలజానాథ్

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రెండున్నరేళ్లలో జగన్‌ సాధించింది అప్పు మాత్రమేనని ఆరోపించారు. ఆ అప్పు కోసమే సీఎం ఢిల్లీ వచ్చినట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్ర హక్కులను కూడా సాధించలేని అసమర్థ నాయకత్వం ఇంకెన్నాళ్లని... ఏపీ ప్రజలను ఇంకెంతకాలం మభ్యపెడతారని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై జగన్ కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ నేతల మాటలు జగన్‌కు పౌరుషాన్ని తెప్పించడం లేదా? అని నిలదీశారు. ఇప్పటి నుంచైనా ముఖ్యమంత్రి పరిపాలన చేయడం నేర్చుకోవాలని శైలజానాథ్ సూచించారు.

Updated Date - 2022-01-05T21:25:28+05:30 IST